తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 2021-2022 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి, జలమండలి ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గత సంవత్సరాలుగా పాటిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈఏడాది కూడా పురపాలక శాఖ వార్షిక నివేదికను విడుదల చేస్తున్నామని చెప్పారు. 8 సంవత్సరాల నుండి స్ఫష్టమైన ఎజెండాతో పని చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లుతున్నామని అన్నారు. అందులో భాగంగా 12 వేల 769 గ్రామాలలో, 142 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, నర్సరీలు, రహదారులు, వీధిలైట్లు, ఫ్లైఓవర్స్, సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయడం జరిగందని అన్నారు. హరిత హారం చేపట్టి రాష్ట్రములో పచ్చదనం పెంపొందించామన్నారు. రాష్ట్రములోని ప్రతి ఉద్యోగి బాగా పని చేయడం వలన అభివృద్ధి జరిగిందన్నారు. పారదర్శకంగా పని చేస్తున్నపుడు ప్రతి ఏడాది ప్రగతి నివేదిక విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుత జనాభా ప్రకారం తమిళనాడు, కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 46.8 శాతం మంది పట్టణాల్లోనే ఉంటున్నారని, కేవలం 3 శాతం భూభాగంలోనే 46.8 శాతం జనాభా ఉంటున్నారని, వచ్చే నాలుగేళ్లలో 50 శాతం తెలంగాణ జనాభా పట్టణాల్లో ఉండే అవకాశం ఉందన్నారు.
త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు:
త్వరలో 50 వేల జనాభా ఉన్న ప్రతి మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఏర్పాటు చేస్తామని, 141 మున్సిపాలిటీల్లో రూ.3700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రతి నెలా మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు. అన్ని పట్టణాల్లో టెన్ పాయింట్ ఎజెండాతో మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతి జిల్లాకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్టు ఉందన్నారు. ఈ ఏడాది అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని అన్నారు. దేశంలో టాప్ 10 నగరాలు తెలంగాణ నుంచే ఉన్నాయని తెలిపారు.
అలాగే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశామని, రూ.3800 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వరదముంపు నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, మొదటి దశలో రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. రూ.540 కోట్లతో మూసీనదిపై 14 బ్రిడ్జిల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ఇక ఇప్పటికే అవుటర్ రింగ్రోడ్ లో రూ.100 కోట్లతో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయగా, కొత్తగా సోలార్ రూఫ్ టాప్తో 21 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ ఏర్పాటు జరుగుతుందన్నారు. రూ.2410 కోట్లతో మొత్తం 104 కొత్త లింక్ రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్, పట్టణాభివృద్ధి అధికారులను, సిబ్బందిని మంత్రి కేటీఆర్ అభినందించారు. కరోనా కాలంలో మున్సిపల్ సిబ్బంది బాగా పని చేశారని, వైద్య సిబ్బందితో కలిసి కరోనా టీకాలు వేయడంలో మున్సిపల్ సిబ్బంది పాత్ర మరచిపోలేమని మంత్రి కేటీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF