తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. గ్రూప్-4 కింద 25 విభాగాలకు చెందిన 9,168 పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్ తో పాటుగా వార్డు ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిధిలో వార్డు ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడంపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గ్రూప్-4 ద్వారా వార్డు ఆఫీసర్ల నియామకం ఒక మార్గదర్శక చొరవ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
“టీఎస్పీఎస్సీ తాజాగా గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా ఒక మార్గదర్శక చొరవలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లను నియమించనుంది. దీని ద్వారా పౌర సమస్యలపై మరింత దృష్టి సారించవచ్చు మరియు వార్డు కౌన్సిలర్లతో సమన్వయం చేసుకోవడంలో ఈ నియామకాలు మరింత సహాయపడతాయి. ఈ నియామకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్ కు నా కృతజ్ఞతలు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Group-4 Notification issued by TSPSC
In a pioneering initiative, Ward officers will be appointed by the Telangana Govt across all 141 Municipalities
This will bring in hyper local focus on civic issues & help synergise with ward councillors
My gratitude to Hon’ble CM KCR Garu pic.twitter.com/2Jx0NPQVT8
— KTR (@KTRTRS) December 2, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE