ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2023 కోసం ఆటగాళ్ల మినీ వేలం ప్రక్రియను కొచ్చి వేదికగా డిసెంబర్ 23న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 వేలం కోసం ఆటగాళ్ల పేర్ల నమోదుకు తుది గడువు నవంబర్ 30తో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ వేలం కోసం మొత్తం 991 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నట్టు వెల్లడించారు. పేర్లు నమోదు చేసుకున్న ఆటగాళ్లలో 714 మంది భారతీయ ఆటగాళ్లు కాగా, 277 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. అలాగే 991 ఆటగాళ్ల జాబితాలో 185 మంది క్యాప్డ్, 786 అన్క్యాప్డ్ మరియు 20 మంది అసోసియేట్ నేషన్స్కు చెందిన ఆటగాళ్లు ఉన్నారు.
వేలానికి అందుబాటులో ఉన్న భారత్ ఆటగాళ్లలో 19 మంది జాతీయ జట్టుకు ఆడగా, 634 మంది ఇంతవరకు భారత్ జట్టు తరఫున ఆడలేదు. మిగిలిన 91 మంది ఇప్పటికే ఒక ఐపీఎల్ మ్యాచ్ అయినా ఆడి ఉన్నారు. అలాగే 166 మంది విదేశీ ఆటగాళ్లు తమ దేశం తరపున ఇప్పటికే అడగా, ఆడనివారు 88, తమ దేశానికి ఆడకుండా ఐపీఎల్ లో ఇప్పటికే ఆడిన విదేశీ ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి 57, సౌతాఫ్రికా నుంచి 52, వెస్టిండీస్ నుంచి 33, ఇంగ్లాండ్ నుంచి 31, న్యూజిలాండ్ నుంచి 27 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. కాగా మొత్తం 991 మంది ఆటగాళ్ల నుంచి ఐపీఎల్ పాలక మండలి షార్ట్ లిస్ట్ చేసి వేలంలో పాల్గొనే తుది జాబితాను ప్రకటించనుంది. అదేవిధంగా ఐపీఎల్ 2023 సీజన్ కోసం ప్రస్తుతం 10 ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 87 మంది క్రికెటర్లను (విదేశీ ఆటగాళ్లు 30 మందితో కలిపి) మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE