తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆగస్టు 24, సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పట్లో పాఠశాలలు తెరిచే అంశంపై సందిగ్థత నెలకొన్న నేపథ్యంలో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. సెప్టెంబర్ 1 నుంచి టీశాట్, డిజిటల్, టీవీ ప్లాట్ఫామ్స్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. అలాగే విద్యార్థులకు ఈ-లెస్సన్స్ తయారు చేయడానికి ఉపాధ్యాయులంతా ఆగస్టు 27 నుంచి పాఠశాలలకు హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాఠశాలల ప్రారంభం, రెగ్యులర్ క్లాసులుపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వచ్చాక మళ్ళీ ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu