తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష 6 వేలు దాటింది. కొత్తగా 1842 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 23, ఆదివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 1,06,091 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 36,282 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 6 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 761 కి పెరిగింది. ఇప్పటివరకు 82,411 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,919 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.67 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.71 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1842):
- జీహెచ్ఎంసీ – 373
- నిజమాబాద్ – 158
- కరీంనగర్ - 134
- సూర్యాపేట – 113
- రంగారెడ్డి – 109
- ఖమ్మం – 77
- వరంగల్ అర్బన్ – 74
- జగిత్యాల – 70
- మహబూబాబాద్ – 64
- మంచిర్యాల – 59
- సంగారెడ్డి – 50
- వనపర్తి – 50
- సిద్దిపేట – 50
- నల్గొండ – 47
- పెద్దపల్లి – 44
- మహబూబ్నగర్ – 42
- భద్రాద్రి కొత్తగూడెం – 37
- జోగుళాంబ గద్వాల్ – 33
- మేడ్చల్ – 32
- నాగర్ కర్నూల్ – 32
- జనగామ – 24
- ఆదిలాబాద్ – 23
- కామారెడ్డి – 20
- యాదాద్రి భువనగిరి – 14
- రాజన్న సిరిసిల్ల – 13
- మెదక్ – 13
- ములుగు – 12
- వికారాబాద్ - 11
- నిర్మల్ – 10
- వరంగల్ రూరల్ - 8
- ఆసిఫాబాద్ – 5
- నారాయణ్ పేట్ – 4
- జయశంకర్ భూపాలపల్లి – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu