కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలను, కాలేజీలను మూసివేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతుండంతో పాఠశాలలను తిరిగి ప్రారంభించడంపై తెలంగాణ విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ప్రత్యక్ష తరగతులకు పాటించాల్సిన నిబంధనలపై వైద్య శాఖ అధికారులు విద్యాశాఖకు పలు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై విద్యాశాఖ పూర్తిస్థాయి నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు సమర్పించింది. దీనిపై రేపటిలోగా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలలో ప్రత్యక్ష బోధన ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ముందుగా 8వ తరగతి నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులకు ప్రభుత్వం అనుమతులు జారీచేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ