సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) మరో ఆరుగురు పేర్లను సిఫారసు చేసింది. ఆరుగురు న్యాయవాదులు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి పొందనున్నారు. ఈ రోజు (జూలై 25, సోమవారం) సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై ఈ నియామకాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆరుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ, తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా నియామక ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన ఆరుగురు న్యాయవాదుల వివరాలు:
- ఎనుగుల వెంకట వేణుగోపాల్ @ ఇ.వి.వేణుగోపాల్
- నగేష్ భీమపాక
- పుల్లా కార్తీక్ @ పి.ఎలమధర్
- కాజా శరత్ @ కె.శరత్
- జగ్గన్నగారి శ్రీనివాసరావు @ జె.శ్రీనివాస్ రావు
- నామవరపు రాజేశ్వర్ రావు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY