ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమ ప్రముఖులతో సమావేశమైన అనంతరం పరిశ్రమలోని 14 వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తానని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 24 సినిమా విభాగాలకు చెందిన 14 వేల మంది సినీ కార్మికులకి ఈ రోజు కృష్ణానగర్లోని అన్నపూర్ణ స్టూడియోలో తలసాని ట్రస్ట్ నుండి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.
ఈ పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసానితో పాటుగా, ప్రముఖ నటుడు నాగార్జున, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ, ఎన్.శంకర్, నిర్మాతలు దిల్ రాజు, రాధాకృష్ణ, టిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) కి పలువురు సినీనటులు, నిర్మాతలు, దర్శకులతో పాటు ఇతరుల నుంచి అందిన విరాళాల ద్వారా కూడా సినీ కార్మికులకి నిత్యావసరాలు అందించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu