తెలంగాణ అసెంబ్లీ ఐదో రోజు సమావేశాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లుపై చర్చ జరుగుతుంది. ముందుగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రెవెన్యూ బిల్లుపై సభలో చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, నూతన రెవెన్యూ బిల్లు ప్రవేశపెట్టిన రోజే అందులోని అన్ని అంశాలను సభలో వివరంగా తెలియజేశామని అన్నారు. ఈ బిల్లుపై సభ్యులంతా సలహాలు, సూచనలు చేయాలని కోరారు. సభ్యుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని, సభ్యులంతా అభిప్రాయాలు వ్యక్తపరిచాక మరోసారి ఈ బిల్లుపై సభకు సవివరంగా వివరిస్తానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ముందుగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ నూతన రెవెన్యూ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. వరుసగా ఎమ్మెల్యేలంతా రెవెన్యూ బిల్లుపై మాట్లాడుతున్నారు. సభలో ఈ బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చ ముగిసాక ఆమోదం తెలుపనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu