తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కాపు కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో, విజయవాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్పై చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన కాపు కార్పోరేషన్ కు తొలి ఛైర్మన్గా రామానుజయ పనిచేశారు.
చలమలశెట్టి రామానుజయ మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. “గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేశాక తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి రామానుజయగారి మరణం విచారకరం. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. రామానుజయగారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu