తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్, సభ్యులను బుధవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నియమించారు. సీఎం కేసీఆర్ ప్రతిపాదనల మేరకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ప్రస్తుతం వ్యవసాయశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి డా.బి.జనార్ధన్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా నియమించారు. ఇక టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.
టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియామకం అయింది వీరే:
- రమావత్ ధన్ సింగ్ (బిటెక్ సివిల్, రిటైర్డ్ ఈఎన్సీ)
- ప్రొ.బి.లింగారెడ్డి (ఎమ్మెస్సీ పిహెచ్డీ, ప్రొ.హెడ్ డిపార్డ్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ సిబిఐటి)
- కోట్ల అరుణ కుమారి (బిఎస్సీ, బీఈడీ, ఎమ్మెఎల్, ఎల్ బీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్)
- సుమిత్రా ఆనంద్ తనోబా (ఎంఏ తెలుగు, తెలుగు పండిట్ )
- కారం రవీందర్ రెడ్డి (బికాం, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి)
- ఆరవెల్లి చంద్రశేఖర్ రావు (బిఎఎమ్ఎస్(ఉస్మానియా), ప్రాక్టీసింగ్ ఆయుర్వేదిక్ డాక్టర్)
- ఆర్.సత్యనారాయణ (బిఎ, జర్నలిస్ట్)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ