మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతుంది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మే 19, బుధవారం కూడా 34,031 కరోనా కేసులు, 594 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,67,537 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 84,371 కి పెరిగింది. ఇక కొత్తగా కరోనా నుంచి 51,457 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 49,78,937 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 91.06 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.54 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 4,01,695 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బుధవారం నాటికి మహారాష్ట్రలో 3,18,74,364 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ