మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నిబద్దతకు, అచంచల విశ్వాసానికి, త్యాగానికి ప్రతీకగా ఉపవాస ధీక్షలతో, జాగారాలతో శివరాత్రి పండుగను హిందువులు జరుపుకుంటారని సీఎం తెలిపారు. సృష్టి లయకారునిగా శివున్ని భక్తి ప్రపత్తులతో కొలుచుకుంటారని అన్నారు. తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు ఆ మహాశివుడు ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ