గండిపేట చెరువు అభివృద్ధి పనులు, సుందరీకరణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి మంగళవారం సమీక్ష చేశారు. బీఆర్కేఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తో కలసి గండిపేట చెరువు సుందరీకరణ పనులపై సీఎస్ సమీక్షించారు. సుందరీకరణలో భాగంగా మొదటి దశలో వాకింగ్ ట్రాక్, సైక్లింగ్ ట్రాక్ కు సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన, పనులను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గండిపేట చెరువు చుట్టు సుందరీకరణ పనులను చేపట్టుటకు తగిన ప్రణాళికలను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.
సుందరీకరణ పనులలో భాగంగా పార్క్ లను కూడా అభివృద్ధి పరచాలని సీఎస్ పేర్కొన్నారు. కోర్టులో ఉన్న కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ అధికారులకు ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, హెచ్ఎండీఏ, ఎండోమెంట్, రెవెన్యూ, తదితర అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE