తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణలో భాగంగా కొనసాగుతున్న లాక్డౌన్ ను రేపటి నుంచి (మే 31) మరో 10 రోజుల పాటుగా పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. లాక్డౌన్ లో భాగంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సడలింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన ప్రజలు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అనగా మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇవ్వనున్నారు. ఇక ప్రతి రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజూ ఉదయం 6 గంటల దాకా కఠినంగా లాక్డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ