తెలంగాణ అంధకారంలో ఉందని, వెలుగులు నింపేందుకే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ పేరుతో పాదయాత్ర తలపెట్టారని తెలిపారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఈ మేరకు ఆయన శనివారం బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్పై పలు విమర్శలు చేశారు.
జేపీ నడ్డా ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
- తెలంగాణ అంధకారంలో ఉంది, వెలుగులు నింపేందుకే బండి సంజయ్ పాదయాత్ర మొదలుపెట్టారు.
- అయితే తెలంగాణలో పాదయాత్ర చేయకుండా బండి సంజయ్ను అడ్డుకోవాలని చూశారు.
- వరంగల్లో సభకు ఒక్క రోజు ముందు అనుమతి రద్దు చేయించారు, అయినా వెనక్కి తగ్గకుండా హైకోర్టును ఆశ్రయించి సభకు అనుమతి పొందాం.
- రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం భయపడుతోంది.
- త్వరలోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపుతారు.
- తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధుల్ని టీఆర్ఎస్ సర్కార్ దుర్వినియోగం చేస్తోంది.
- కేంద్రం తెలంగాణకు ‘జల్ జీవన్ మిషన్’ కింద రూ. 3,500 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం వాటిలో కేవలం రూ. 200 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
- మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని వరంగల్ జైలుని కూల్చివేశారు. ఇప్పటివరకు ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించలేదు.
- టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదు కానీ అవినీతి మాత్రం బాగా జరిగింది.
- వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో తప్పక అధికారంలోకి వస్తుంది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY