తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 4 ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎట్ రిస్క్ కంట్రీస్ నుండి 9122 మందిరాగా, ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో 59 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు తెలిపారు. వీరి శాంపిల్స్ని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపగా ఇప్పటికి నలుగురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని చెప్పారు. ఇక ఎట్ రిస్క్ కంట్రీస్ నుండి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చిన వారిలో ర్యాండమ్ గా నిర్వహించిన కరోనా పరీక్షల ఆధారంగా మరో 19 మందిలో ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ గా తేలింది. అలాగే ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్న ఒకరికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 24 కు చేరుకుంది. కాగా ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ గా తేలిన మరో 13 శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలిపారు.
మరోవైపు తెలంగాణలో కొత్తగా 172 పాజిటివ్ కేసులు నమోదవడంతో డిసెంబర్ 21, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,79,892 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి మరో 188 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 6,72,251 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 98.87 శాతంగా ఉంది. కరోనా వలన రాష్ట్రంలో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,016 కి పెరిగింది. కాగా మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,625 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 86, రంగారెడ్డిలో 20 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ