దేశంలో ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు చేసే దిశగా కేంద్ర ముందడుగు వేసింది. బోగస్ ఓట్లను తొలగించటమే లక్ష్యంగా ఓటరు ఐడీలకు ఆధార్ నంబర్ ను అనుసంధానం చేయడంతోపాటు ఎన్నికల చట్టంలో కీలక సవరణలకు బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లు ఉభయసభలలో ఆమోదం పొందింది. దీనికోసం ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, 1951ల్లోని సెక్షన్లకు పలు సవరణలు చేశారు. కాగా, ఇది తమ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయమని న్యాయశాఖామంత్రి న్యాయ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు 2021 చాలా కాలంగా చర్చించబడుతున్న వివిధ ఎన్నికల సంస్కరణలను పొందుపరిచింది. ఓటరుగా నమోదు కావడానికి అర్హత ఉన్న వ్యక్తి చేసిన దరఖాస్తు ఆధారంగా ఎలక్టోరల్ రోల్లో నమోదు చేయబడుతుంది. ఈ బిల్లులో కొత్త దరఖాస్తుదారు గుర్తింపు కోసం దరఖాస్తుతో పాటు స్వచ్ఛందంగా ఆధార్ నంబర్ను అందించే నిబంధన ఉంది. ఆధార్ నంబర్ ఇవ్వనందున ఏ దరఖాస్తు తిరస్కరించబడదు. ఓటర్లు తరచుగా నివాసాన్ని మార్చడం, కొత్త స్థలంలో నమోదు చేసుకోవడం వంటి సమస్యలకు ఇది పరిష్కారం కానుంది. ఒకే వ్యక్తికి ఒకటికంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉంటె గుర్తించి తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అందువల్ల ఇది ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఉండటంలో సహాయపడుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ