తెలంగాణ రాష్ట్రంలో మార్చి 2023లో జరగనున్న పదోతరగతి వార్షిక పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ఎస్.ఎస్.సీ బోర్డు/డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఇప్పటికే ప్రకటంచిన సంగతి తెలిసిందే. ముందుగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 15 వరకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆ గడువు ముగియడంతో విద్యార్థులకు మరో అవకాశం ఇస్తూ, తాజాగా పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఎస్.ఎస్.సీ/ఓఎస్ఎస్సీ/వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ లో ఒకసారి ఫెయిల్ అయిన అభ్యర్థులు మార్చి 2023 వార్షిక పరీక్షల కోసం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 24వ తేదీవ వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఎస్.ఎస్.సీ బోర్డు డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు-2023 ఫీజు చెల్లింపుల వివరాలు:
- ఫీజు చెల్లింపు తుది గడువు : నవంబర్ 24 (ఆలస్య ఫీజు లేకుండా)
- రూ.50 ఆలస్య ఫీజుతో చెల్లింపుకు చివరి తేదీ : డిసెంబర్ 5
- రూ.200 ఆలస్య ఫీజుతో చెల్లింపుకు చివరి తేదీ: డిసెంబర్ 15
- రూ.500 ఆలస్య ఫీజుతో చెల్లింపు గడువు: డిసెంబర్ 29.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE