తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ సన్నిధిలో పూజలు నిర్వహించి “హత్ సే హత్ జోడో” పాదయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందేశాన్ని సామాన్య ప్రజలకు చేరవేయడంతో పాటుగా ప్రభుత్వాల వైఫల్యాలను ఎత్తి చూపేందుకు హత్ సే హత్ జోడో అభియాన్ యాత్ర చేపట్టాలని జాతీయ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ములుగు నుంచి రేవంత్రెడ్డి ఈ యాత్రను ప్రారంభించారు. మొదటి రోజు యాత్ర చాలా ఆశలు మరియు ఉత్సాహంతో ప్రారంభమైందని, తనతో పాటుగా యాత్రలో పాల్గొని చాలా దూరం కలిసి నడిచినందుకు తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జి మానిక్ రావ్ ఠాక్రేకు రేవంత్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇక రేవంత్రెడ్డి హత్ సే హత్ జోడో యాత్ర రెండోరోజు కూడా ములుగు నియోజకవర్గంలోనే కొనసాగనుంది.
రేవంత్ రెడ్డి ‘హత్ సే హత్ జోడో’ యాత్ర రెండో రోజు షెడ్యూల్:
- ఉదయం 8 నుంచి 8.30 గంటల వరకు: రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు
- ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు: రామప్ప గ్రామం నుంచి బుద్ధారం గ్రామానికి చేరిక
- మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు: భోజన విరామం
- మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు: బుద్దారం నుంచి ములుగు జిల్లా కేంద్రానికి చేరిక
- సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు: ములుగులో గాంధీ పార్కు వద్ద జనసభ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE