కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాలేజీలు తిరిగి ప్రారంభమయ్యేంత వరకు విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించేలా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆగస్టు 17 నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఆగస్టు 14, శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు డీడీ యాదగిరి, టీశాట్ ద్వారా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని బోర్డు సూచించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu