తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో నడిపే పల్లె వెలుగు బస్సుల్లో టికెట్ ఛార్జీలకు సంబంధించి రౌండప్ విధానాన్ని అమలు చేయనుంది. పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు పరిష్కారం దిశగానే టీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం పల్లె వెలుగు బస్సుల్లో రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్ ధర రూ.10గా రౌండప్ చేయబడింది. రూ.13, రూ.14 ఉన్న టికెట్ ఛార్జీలను రూ.15 గా మార్చారు. అదేవిధంగా 80 కిలోమీటర్ల దూరానికి ప్రస్తుతమున్న రూ.67 ఛార్జీని రూ.65గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు టోల్ ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1, హైటెక్ మరియు ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనున్నారు. టికెట్ చార్జీల్లో రౌండప్ విధానం నేటి నుంచే అమలు కానుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ