ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్టైన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడికి ఏసీబీ న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా అనారోగ్య కారణాల దృష్ట్యా న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు చేసుకున్న అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు.
ప్రస్తుతం కరోనా నిబంధనల వలన అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అనుమతి ఇవ్వలేమని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. గత 2 నెలలుగా ఎవరికీ కూడా అనుమతి ఇవ్వడం లేదని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు అనుమతి కోసం గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ని చంద్రబాబు సంప్రదించగా, మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని ఆయన సూచించినట్లుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu