ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ భవనంలో ఆయన ఈరోజు ఉదయం లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్య వరప్రసాద్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయ్ బాబు మరియు తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి తదితరులు హాజరై కొమ్మినేని శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు అందజేశారు. కాగా గత గురువారం ఆయనను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో కొమ్మినేని శ్రీనివాసరావును నియమించింది. దీంతో కొమ్మినేని రెండేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. కాగా కొమ్మినేనికి వివిధ మీడియా సంస్థల తరపున జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE