తెలంగాణలో కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో మరో 1087 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 27, శనివారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13436 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 3923 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో ఆరుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 243 కి పెరిగింది. కోవిడ్ నుంచి మరో 162 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4928 కి చేరింది. ప్రస్తుతం 8265 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1087):
- జీహెచ్ఎంసీ ఏరియా – 888
- రంగారెడ్డి – 74
- మేడ్చల్ – 37
- నల్గొండ – 35
- సంగారెడ్డి – 11
- వరంగల్ అర్బన్ – 7
- కామారెడ్డి – 5
- కరీంనగర్ – 5
- మహబూబ్ నగర్ – 5
- నాగర్ కర్నూల్ – 4
- జనగామ – 4
- సిరిసిల్ల – 3
- సిద్ధిపేట – 2
- భద్రాద్రి కొత్తగూడెం – 2
- ఆసిఫాబాద్ – 1
- ఖమ్మం – 1
- వనపర్తి – 1
- మహబూబాబాద్ – 1
- మంచిర్యాల – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu