సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పేర్కొంటూ బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఏడాది అధికారికంగా కార్యక్రమం నిర్వహించనుడటం తెలిసిందే. ఈ వేడుకలలో భాగంగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) మహిళా మోర్చా విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్లో బుధవారం ఆరెంజ్ బ్రిగేడ్ బైక్ ర్యాలీ చేపట్టారు. చార్మినార్లోని భాగ్యలక్ష్మి ఆలయం నుండి పరేడ్ గ్రౌండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా భాగ్యలక్ష్మీ ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ ప్రారంభించారు. ఇక కార్యక్రమంలో భాగంగా ఆయన ర్యాలీలో బైకును ముందు నడుపుతూ బీజేపీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ఇక భారతీయ జనతా పార్టీ మహిళా విభాగానికి చెందిన కొన్ని వందల మంది సభ్యులు ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
ఇక తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు హైదరాబాద్ నగరానికి వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబర్ 17వ తేదీ ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అలాగే టాలీవుడ్ హీరో ప్రభాస్ ను కూడా కలవనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. గత హైదరాబాద్ పర్యటనలో ఆయన జూ ఎన్టీఆర్ ను కలవడం రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అదేరోజు సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా జరపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలపై పోలీసులు దృష్టి సారించారు. ఎక్కువమంది సిబ్బందిని నియమించి అనుక్షణం అప్రమత్తంగా ఉండేలా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY