తెలంగాణలో రోజురోజుకి కరోనా వైరస్ ప్రభావం మరింతగా పెరుగుతుంది. ముఖ్యంగా జీహెఛ్ఎంసీ పరిధిలో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, ఆదివారం నాటికీ మొత్తం కేసుల సంఖ్య 14,419 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఆదివారం నాడు 3227 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన మరో నలుగురు మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 247 కి పెరిగినట్టు తెలిపారు.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న 244 మందితో కలిపి డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 5172 కి చేరింది. ప్రస్తుతం 9000 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 816, రంగారెడ్డి లో 47, మంచిర్యాలలో 33, మేడ్చల్ లో 29, వరంగల్ రూరల్ లో 19, వరంగల్ అర్బన్ లో 12 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu