ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం మరింతగా పెరుగుతుంది. దీంతో రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మరో 2602 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, వీటిలో 2592 మంది స్థానికులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 8 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఇద్దరు ఉన్నారు. కొత్తగా నమోదైన 2602 కేసులతో కలిపి జూలై 17, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 40646 కు చేరింది. గత 24 గంటల్లో 20,245 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. మరోవైపు కరోనా వలన రాష్ట్రంలో మరో 42 మంది మరణించారు. అనంతపూర్ లో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమ గోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, నెల్లూరు లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు మరణించడంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 534 కి చేరింది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (జూలై 17, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 40646
- కొత్తగా నమోదైన కేసులు : 2602
- నమోదైన మరణాలు : 42
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 20298
- యాక్టీవ్ కేసులు : 19814
- మొత్తం మరణాల సంఖ్య : 534
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu