ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10830 కరోనా పాజిటివ్ కేసులు, 81 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో నాలుగు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1528, నెల్లూరులో 1168, విశాఖపట్నంలో 1156, పశ్చిమగోదావరిలో 1065 నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. ఆగస్టు 26, బుధవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,82,469 కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3541 కి చేరుకుంది.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- తూర్పుగోదావరి – 53567
- కర్నూల్ – 40845
- అనంతపూర్ – 36948
- గుంటూరు – 32308
- విశాఖపట్నం – 32717
- పశ్చిమ గోదావరి – 32244
- చిత్తూరు – 32205
- నెల్లూరు – 25443
- కడప – 22411
- శ్రీకాకుళం – 20104
- ప్రకాశం – 18661
- విజయనగరం – 17471
- కృష్ణా – 14650
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu