తమిళనాడు రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో జూలై 23, గురువారం నాడు ఒక్కరోజే 6472 కరోనా పాజిటివ్ కేసులు, 88 కరోనా మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక 6 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,92,964 కి చేరింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క చెన్నైలోనే 90,900 కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోవైపు గురువారం నాటికీ రాష్ట్రంలో 21,57,869 కరోనా పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు.
తమిళనాడు కరోనా కేసుల వివరాలు (జూలై 23, గురువారం):
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 1,92,964
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 1,36,793
- యాక్టీవ్ కేసులు – 52,939
- జూలై 23 న నమోదైన కేసులు – 6472
- జూలై 23 న డిశ్చార్జ్ అయినవారు – 5210
- జూలై 23 న నమోదైన మరణాల సంఖ్య – 88
- మొత్తం మరణాల సంఖ్య – 3232
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu