ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 13,474 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 7 జిల్లాల్లో 1000 కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడపలో 2031, కర్నూల్ లో 1835, విశాఖపట్నంలో 1349, గుంటూరులో 1342, ప్రకాశంలో 1259, తూర్పుగోదావరిలో 1066, నెల్లూరులో 1007 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో జనవరి 27, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,36,047కు, మరణాల సంఖ్య 14579 కు పెరిగింది. గడిచిన 24 గంటల్లో 10,290 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 21,11,975 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,09,493 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.
ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(13,474):
- కడప – 2031
- కర్నూల్ – 1835
- విశాఖపట్నం – 1349
- గుంటూరు – 1342
- ప్రకాశం – 1259
- తూర్పుగోదావరి – 1066
- నెల్లూరు – 1007
- అనంతపూర్ – 980
- కృష్ణా – 873
- పశ్చిమగోదావరి – 676
- విజయనగరం – 469
- చిత్తూరు – 328
- శ్రీకాకుళం – 259
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ