ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 7998 కరోనా పాజిటివ్ కేసులు, 61 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసుల్లో మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరిలో 1391, గుంటూరులో 1184, అనంతపూర్ లో 1016 నమోదయ్యాయి. దీంతో జూలై 23, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 72711 కు చేరింది. మరో 5428 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 37555 కి చేరింది. ప్రస్తుతం 34272 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 884 కి చేరుకుంది.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
- అనంతపూర్ – 7282
- చిత్తూరు – 5939
- కర్నూల్ – 8701
- కడప – 3573
- తూర్పుగోదావరి – 10038
- పశ్చిమ గోదావరి – 5734
- నెల్లూరు – 3448
- ప్రకాశం – 2704
- గుంటూరు – 8097
- కృష్ణా – 4482
- శ్రీకాకుళం – 3575
- విజయనగరం – 2080
- విశాఖపట్నం – 4163
- ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
- విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu