తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1986 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 30, గురువారం రాత్రి 9 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 62,703 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. గురువారం నాడు 21,380 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 14 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 519 కి పెరిగింది. ఇప్పటివరకు 45,388 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 16,796 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.3 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.82 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1986):
- జీహెచ్ఎంసీ – 586
- మేడ్చల్ – 207
- రంగారెడ్డి – 205
- వరంగల్ అర్బన్ – 123
- కరీంనగర్ – 116
- సంగారెడ్డి – 108
- మహబూబ్ నగర్ – 61
- కామారెడ్డి – 46
- మెదక్ – 45
- ఖమ్మం – 41
- మహబూబాబాద్ – 37
- నల్గొండ – 36
- మంచిర్యాల – 35
- జోగులాంబ గద్వాల్ – 32
- నాగర్ కర్నూల్ – 30
- వరంగల్ రూరల్ – 30
- భద్రాద్రి కొత్తగూడెం – 29
- ములుగు – 27
- పెద్దపల్లి – 26
- రాజన్న సిరిసిల్ల – 23
- జనగామ – 21
- సిద్ధిపేట -20
- నిజామాబాద్ – 19
- వనపర్తి – 18
- ఆదిలాబాద్ -16
- యాదాద్రి భువనగిరి – 12
- నిర్మల్ – 9
- జగిత్యాల – 7
- సూర్యాపేట – 6
- వికారాబాద్ – 5
- నారాయణ పేట్ – 4
- జయశంకర్ భూపాలపల్లి – 4
- ఆసిఫాబాద్ – 2
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu