ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 10376 కరోనా పాజిటివ్ కేసులు, 68 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో మూడు జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అనంతపూర్ లో 1387, తూర్పు గోదావరిలో 1215, కర్నూల్ లో 1124 నమోదయ్యాయి. రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పుగోదావరి, కర్నూల్, అనంతపూర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో కేసులు ఎక్కువుగా నమోదయ్యాయి. దీంతో జూలై 31, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 140933 కు చేరింది. మరో 3822 మంది కరోనా నుంచి కోలుకోవడంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 63864 కి చేరింది. ప్రస్తుతం 75720 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1349 కి చేరుకుంది.
ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య:
తూర్పుగోదావరి – 20395
కర్నూల్ – 16847
అనంతపూర్ – 14699
గుంటూరు – 14688
పశ్చిమ గోదావరి – 12310
విశాఖపట్నం – 10765
చిత్తూరు – 10378
కడప – 7876
నెల్లూరు – 7316
కృష్ణా – 6843
శ్రీకాకుళం – 6570
ప్రకాశం – 5167
విజయనగరం – 4202
ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు: 2461
విదేశాల నుంచి వచ్చిన వారు: 434
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu