తెలంగాణలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఆగస్టు 11, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 84,544 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. మంగళవారం నాడు 22,972 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 9 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 654 కి పెరిగింది. ఇప్పటివరకు 61,294 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,596 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 72.49 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.77 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1897):
- జీహెచ్ఎంసీ – 479
- మేడ్చల్ – 172
- రంగారెడ్డి – 162
- సంగారెడ్డి – 107
- వరంగల్ అర్బన్ – 87
- కరీంనగర్ – 64
- ఖమ్మం – 63
- పెద్దపల్లి – 62
- సిద్ధిపేట – 62
- నల్గొండ – 54
- కామారెడ్డి – 48
- భద్రాద్రి కొత్తగూడెం – 44
- రాజన్న సిరిసిల్ల – 43
- మహబూబ్ నగర్ – 41
- జోగులాంబ గద్వాల్ – 38
- మంచిర్యాల – 38
- సూర్యపేట – 36
- జగిత్యాల – 28
- జనగామ – 26
- మెదక్ – 26
- వనపర్తి – 26
- వరంగల్ రూరల్ – 24
- నిజామాబాద్ – 23
- నిర్మల్ – 21
- ఆదిలాబాద్ – 21
- వికారాబాద్ – 18
- జయశంకర్ భూపాలపల్లి – 16
- నాగర్ కర్నూల్ – 16
- మహబూబాబాద్ – 14
- నారాయణ్ పేట్ – 12
- ములుగు – 10
- యాదాద్రి భువనగిరి – 11
- ఆసిఫాబాద్ – 5
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu