ఏపీలో 2475 కి చేరిన కరోనా మరణాలు, ఒకే రోజు 97 మంది మృతి

AP Covid-19 Updates, andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు, 97 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 8943 కేసులతో కలిపి ఆగస్టు 14, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం‌ కేసుల సంఖ్య 273085 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) రికార్డ్ స్థాయిలో 53026 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు.

ఇక రాష్ట్రంలో కరోనా వలన కర్నూల్ జిల్లాలో పన్నెండు మంది, చిత్తూరులో పది మంది, తూర్పుగోదావరిలో పది మంది, గుంటూరు పది మంది, నెల్లూరులో పది మంది, పశ్చిమగోదావరిలో పది మంది, అనంతపూర్ లో ఆరుగురు, కడపలో ఆరుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, విజయనగరంలో ముగ్గురు, కృష్ణాలో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2475 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 180703 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 9779 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 89907 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu