ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతాం, సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy Sensational Comments on Topic of Division of AP State,Sajjala Ramakrishna Reddy Comments,We Want Joint AP,Sajjala Ramakrishna Reddy,Mango News,Mango News Telugu,Jagan Latest News And Updates,Ap Cm Ys Jagan Mohan Reddy,Tdp Party, Ysr Congress Party,Janasena Party,Andhra Pradesh,Ap Politics,Ap Political News And Updates,Ap Cm Jagan Srikakulam Tour,Jagan Tour Latest News And Updates,AP Latest News and Updates,Andhra Pradesh Politics News and Live Updates,Andhra Pradesh News,Andhra Pradesh Latest News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) మొదటి నుంచి పోరాటం చేసిందని అన్నారు. సుప్రీంకోర్టులో విభజన కేసుపై ఏపీ ప్రభుత్వ విధానాన్ని తప్పుపడుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల స్పందించారు.

గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఒకేవేళ కుదిరితే కలిసి రావాలి, మళ్ళీ కలిసి ఉండాలి, ఉమ్మడి రాష్ట్రమైతే బాగుంటుంది. ఉమ్మడి రాష్ట్రానికే మా ఓటు. దానికోసం ఏ వేదిక దొరికినా కూడా, మళ్ళీ కలవడానికి అయితే మా పార్టీ గానీ, ప్రభుత్వం గానీ ఓటు దానికే వేస్తుంది. ఆ విషయాన్నే అడ్వొకేట్ కూడా చేస్తుంది. కానీ 8 ఏళ్ల తర్వాత ప్రాక్టికల్ గా ఇంత జరిగాక, పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవల్సి ఉంటుంది, దాని మీద మేమెప్పుడూ ముందు ఉంటున్నాం” అని పేర్కొన్నారు.

“ఆ రోజున విభజనకు వ్యతిరేకంగా పోరాడింది మేమే. నిన్న ఉండవల్లి మాట్లాడిన మాటలు కొంత అసందర్భంగా అనిపించాయి. అలాగే ఎందుకో పనిగట్టుకుని సీఎం జగన్ వైపు చూపిస్తున్నట్టు అనిపించాయి. అలా ఎందుకన్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు ఎక్కడ ప్లాట్ ఫామ్ దొరికినా, ఎక్కడ అవకాశం వచ్చినా రాష్ట్రం ఏదైతే అన్యాయంగా మనం విభజనకు గురయ్యాము అనే భావన అందరిలో ఉంది. మాలో ఇంకా బలంగా ఉంది, సీఎం జగన్ గట్టిగా అది నమ్ముతున్నారు. అందువలన మళ్ళీ కనుక ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే మొట్టమొదట స్వాగతం చెప్పేది, అందుకోసం అవసరం అయితే ఎంతవరకైనా పోరాడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం. ఆ అన్యాయాన్ని వెనక్కి తిప్పగలిగితే అలాంటిది కావాలి, లేని పక్షంలో దాన్ని సరిదిద్దనైనా సరిదిద్దాలి. అందుకోసం గట్టిగా పట్టుబడతాం. దాంట్లో ఎలాంటి దాపరికాలు లేవన్నారు” అని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఏదైనా చేయాలంటే ఎలా ఉంటుందనేది ఆయనకు తెలుసనీ ఉండవల్లిని ఉద్దేశించి సజ్జల వ్యాఖ్యానించారు. తమిళనాడులో చెన్నై, లేదా ఇంకోటో కావాలంటే జరగవని, ఈ విషయం వెనక్కి పోలేదన్నారు. పోవడానికి అవకాశం లేకపోవడంతో కొన్నింటిని అంగీకరించక తప్పదన్నారు. అయితే ఏపీ విభజన చట్టం అసంబద్ధమని సుప్రీంకోర్టులో కేసు ఉందని, రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా కోర్టులో మా వాదనలు బలంగా వినిపిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =