తమిళనాడు రాష్ట్రంలో కరోనా ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14, శుక్రవారం నాడు ఒక్కరోజే 117 కరోనా మరణాలు, 5890 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,245 కి చేరింది. గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ 100 మందికి పైగానే కరోనా వలన మరణిస్తుండడంతో మొత్తం మరణాల సంఖ్య 5,514 కి పెరిగింది. కరోనా నుంచి కొత్తగా 5,556 మంది కోలుకోవడంతో, డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2,67,015 కు చేరుకుంది. ప్రస్తుతం 53,716 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు గురువారం నాటికీ రాష్ట్రంలో 35,69,453 కరోనా పరీక్షలను నిర్వహించి, దేశంలో కరోనా పరీక్షల నిర్వహణలో తమిళనాడు మొదటి స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu