ఏపీలో కరోనా నుంచి కోలుకుని ఇప్పటికి 2,09,100 మంది డిశ్చార్జ్

andhra pradesh, AP Corona Positive Cases, AP Coronavirus, AP COVID 19 Cases, AP Total Positive Cases, Coronavirus, Coronavirus Breaking News, coronavirus latest news, Coronavirus live updates, COVID-19, Total Corona Cases In AP

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 6780 కరోనా పాజిటివ్ కేసులు, 82 మరణాలు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 6780 కేసులతో కలిపి ఆగస్టు 17, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం‌ కేసుల సంఖ్య 2,96,609 కు చేరింది. గత 24 గంటల్లో(9AM-9AM) 44578 కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపారు.

ఇక రాష్ట్రంలో కరోనా వలన ప్రకాశంలో పదమూడు మంది, తూర్పుగోదావరిలో పది మంది, చిత్తూరులో ఎనిమిది మంది, గుంటూరులో ఏడుగురు, కడపలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2732 కి చేరింది. ఇక నమోదైన మొత్తం కేసుల్లో 2,09,100 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడగా, గత 24 గంటల్లోనే 7866 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో మరియు కోవిడ్ కేర్ సెంటర్స్ లో మొత్తం 84777 మంది చికిత్స పొందుతున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu