తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 17, సోమవారం నాడు ఒక్కరోజే 120 కరోనా మరణాలు, 5890 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,43,945 కి చేరింది. గతకొన్ని రోజులుగా ప్రతిరోజూ 100 మందికి పైగానే కరోనా వలన మరణిస్తుండడంతో మొత్తం మరణాల సంఖ్య 5,886 కి పెరిగింది. కరోనా నుంచి కొత్తగా 5667 మంది కోలుకోవడంతో, డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య 2,83,937 కు చేరుకుంది. ప్రస్తుతం 54,122 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు సోమవారం నాటికీ రాష్ట్రంలో 37,78,778 కరోనా పరీక్షలను నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu