తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆగస్టు 18, మంగళవారం నాడు 1763 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 95,700 కి, మరణాల సంఖ్య 719 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా నుంచి మరో 1789 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 73,991 కి చేరింది. ప్రస్తుతం 20,990 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 77.31 శాతం, మరణాల రేటు 0.75% (< 1%) శాతంగా ఉంది.
తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 484, మేడ్చల్ లో 169, రంగారెడ్డిలో 166, వరంగల్ అర్బన్ లో 88, నల్గొండలో 65, కామారెడ్డిలో 63, జగిత్యాలలో 61, మంచిర్యాలలో 55, కరీంనగర్ లో 53, పెద్దపల్లిలో 46, నిజామాబాద్ లో 45, ఖమ్మంలో 41, సిద్దిపేటలో 37, భద్రాద్రి కొత్తగూడెంలో 35, మహబూబ్ నగర్ లో 33, వరంగల్ రూరల్ లో 31, సంగారెడ్డిలో 31, రాజన్న సిరిసిల్లలో 31, జోగులాంబ గద్వాల్ లో 30 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu