తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, పార్టీల కీలక నాయకులు సైతం కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతునట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో మంగళవారం నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 95,700 కి చేరింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu