ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్-2020, ఎంసెట్ అగ్రికల్చర్-2020 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,899 మంది హాజరుకాగా, ఎంసెట్ అగ్రికల్చర్ విభాగానికి 75,834 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్లో 84.78 శాతం, అగ్రికల్చర్, మెడిసిన్ విభాగంలో 91.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ర్యాంక్ కార్డులను https://sche.ap.gov.in/EAMCET/ వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా త్వరలోనే ప్రవేశ పక్రియకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించనున్నట్టు మంత్రి సురేష్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu