ఏపీ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల

AP Eamcet 2020 Results Released Today,Mango News,Mango News Telugu,AP Eamcet 2020 Results,AP Eamcet 2020 Results Out Now,AP Eamcet Results 2020,AP Eamcet Results,Andhra Pradesh Eamcet 2020 Results,APEAMCET Results 2020,AP EAMCET 2020 result declared,AP EAMCET Results 2020 Live,AP EAMCET Result 2020 Live Updates

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెప్టెంబర్ 17 వ తేదీ నుంచి 25 వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజినీరింగ్-2020‌, ఎంసెట్ అగ్రికల్చర్-2020 పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు 1,56,899 మంది హాజరుకాగా, ఎంసెట్ అగ్రికల్చర్ విభాగానికి 75,834 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌లో 84.78 శాతం, అగ్రికల్చర్‌, మెడిసిన్‌ విభాగంలో 91.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు పేర్కొన్నారు. ఎంసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ర్యాంక్ కార్డులను https://sche.ap.gov.in/EAMCET/ వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా త్వరలోనే ప్రవేశ పక్రియకు సంబంధించి షెడ్యూల్ ప్రకటించనున్నట్టు మంత్రి సురేష్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 6 =