దేశంలో మరో 47,905 కరోనా కేసులు, 550 మరణాలు నమోదు

Covid-19 in India : 47905 Positive Cases, 550 Deaths Reported in Last 24 Hours

భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజులుగా 50 వేలకంటే తక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 47,905 కరోనా కేసులు, 550 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 12, గురువారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 86,83,916 కు, మరణాల సంఖ్య 1,28,121 కు చేరుకుంది. మరోవైపు కొత్తగా 52,718 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 80,66,501 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 92.89 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.48 శాతంగా ఉంది. అలాగే దేశంలో ప్రస్తుతం 4,89,294 మంది చికిత్స పొందుతున్నారు. ఇక నవంబర్ 11 నాటికీ మొత్తం 12,19,62,509 కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లోనే 11,93,358 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ