మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో ఇప్పటికే పాజిటివ్ కేసులు సంఖ్య 17 లక్షలు దాటింది. నవంబర్ 11, బుధవారం నాడు కూడా 4907 కరోనా కేసులు, 125 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,31,833 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 45,560 కి పెరిగింది.
ఇక కొత్తగా కోవిడ్ నుంచి 9,164 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 15,97,255 కు చేరుకుంది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 92.23 శాతంగా ఉండగా, మరణాల రేటు 2.63 శాతంగా నమోదైంది. ప్రస్తుతం 88,070 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరోవైపు గురువారం నాటికీ మహారాష్ట్రలో 96,00,328 కరోనా పరీక్షలు నిర్వహించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ