భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంచెం తగ్గుముఖం పట్టింది. నాలుగు నెలల తర్వాత దేశంలో తొలిసారిగా 30 వేల కంటే తక్కువుగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 29163 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో నవంబర్ 17, మంగళవారం ఉదయానికి మొత్తం కేసుల సంఖ్య 88,74,290 కు చేరుకుంది. అలాగే కరోనాతో మరో 449 మంది మరణించడంతో మరణాల సంఖ్య 1,30,519 కి పెరిగింది. మరోవైపు ఇప్పటికే 82 లక్షల మందికిపైగా కరోనా నుంచి కోలుకున్నారు.
ఒకేరోజులో 40791 మంది బాధితులు కోలుకోవడంతో రికవరీ అయిన వారి సంఖ్య 82,90,370 కు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 93.42 శాతం గానూ, మరణాల రేటు 1.47 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 4,53,401 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో కొనసాగుతుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ