ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 15.6 లక్షలు దాటగా, కరోనా మరణాలు పదివేలు దాటాయి. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 90,609 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 19,981 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 3227, చిత్తూరులో 2581, విశాఖపట్నంలో 2308, అనంతపూర్ లో 1787, పశ్చిమగోదావరిలో 1537, శ్రీకాకుళంలో 1338 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15,62,060 కు చేరుకుంది.
ఇక కరోనా వలన మరో 118 మరణాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమగోదావరిలో పదిహేను మంది, చిత్తూరులో పద్నాలుగు మంది, తూర్పుగోదావరిలో పదకొండు మంది, విశాఖపట్నంలో పదకొండు మంది, గుంటూరులో పది మంది, అనంతపూర్ లో తొమ్మిది మంది, కృష్ణాలో తొమ్మిది మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, విజయనగరంలో ఎనిమిది మంది, కర్నూల్ లో ఏడుగురు, నెల్లూరులో ఏడుగురు, ప్రకాశంలో ఏడుగురు, కడపలో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 10022 కి పెరిగింది. గత 24 గంటల్లో 18336 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 13,41,355 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,10,683 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ