14.58 లక్షల రైతుల ఖాతాలలో రూ.510 కోట్ల పైగా జమ – సీఎం జగన్

AP CM YS Jagan, AP CM YS Jagan Releases YSR Sunna Vaddi Scheme Funds, Farm Loan, Mango News Telugu, Sunna Vaddi Scheme, YSR Sunna Vaddi Beneficiary List 2020, YSR Sunna Vaddi Funds, YSR Sunna Vaddi Pathakam, YSR Sunna Vaddi Scheme, YSR Sunna Vaddi Scheme 2020, YSR Sunna Vaddi Scheme Funds, YSR Sunna Vaddi Scheme Funds for Farm Loan, YSR Sunna Vaddi Scheme In AP

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి నవంబర్ 17, మంగళవారం నాడు వర్చువల్‌గా ‘వైఎస్ఆర్‌‌ సున్నా వడ్డీ’ పంట రుణాల పథకం చెల్లింపులను ప్రారంభించారు. పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీని పూర్తిగా చెల్లిస్తునట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద రాష్ట్రంలో 2019 కి సంబంధించి 14.58 లక్షల రైతుల ఖాతాలలో ఈ రోజు రూ.510 కోట్ల పైగా జమ చేస్తునట్టు తెలిపారు. మరోవైపు అక్టోబర్‌ నెలలో దెబ్బతిన్న పంటలకు సంబంధించి, నెల రోజులలోపే మొత్తం రూ.132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌ మాట్లాడుతూ, రైతులకు మంచి చేసే విషయంలో సంతోషాన్ని కలిగించే మరో ఘట్టం ఇదని అన్నారు. రైతులకు ఎంత చేసినా తక్కువేనని చెప్పారు. పంటరుణాలు సకాలంలో కడితే, దానిపై వడ్డీని ప్రభుత్వమే కడుతుందనే ఆత్మవిశ్వాసాన్ని రైతుల్లో ఈ రోజు ప్రభుత్వం కలిగించిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా రైతుకు భరోసా ఇవ్వలేదని అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే దాదాపుకు 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చామని చెప్పారు. రైతు భరోసా కింద సాయం, రైతు భరోసా కేంద్రాలు, ఉచితంగా బోర్లు, పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్, రైతు భీమా ఇలా రైతులకు కోసం చేపట్టిన పలు పథకాల గురించి సీఎం వైఎస్ జగన్ వివరించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 18 =