సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) బోర్డు పరీక్షల నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ శనివారం నాడు కీలక ప్రకటన చేశారు. సీబీఎస్ఈ బోర్డు 10, 12 వ తరగతుల పరీక్షలు నిర్వహించే తేదీని వెల్లడిస్తానని పేర్కొన్నారు. “విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం ప్రధాన ప్రకటన. 2021లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమయ్యే తేదీని డిసెంబర్ 31, గురువారం సాయంత్రం 6 గంటలకు ప్రకటిస్తాను” అని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. గతకొన్ని రోజులుగా 2021 సీబీఎస్ఈ పరీక్షలపై దేశవ్యాప్తంగా చర్చనడుస్తుంది. ఈ అంశంపై ఇటీవలే ఉపాధ్యాయులతో వర్చువల్ సమావేశం ద్వారా కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్ చర్చించారు. అనంతరం సీబీఎస్ఈ 10,12 తరగతి విద్యార్థులకు జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో పరీక్షలు ఉండవని స్పష్టంచేశారు. ఈ నేపధ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీని ప్రకటిస్తానని మంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి నెలకుంది.
📢Major announcements for students & parents!
I will announce the date when the exams will commence for students appearing for #CBSE board exams in 2021.
Stay tuned. pic.twitter.com/Lvp9Lf0qsT
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) December 26, 2020
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ